ప్రెస్మీట్లో కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తున్నామన్నారు. అభ్యర్థులందరితో క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఆందోల్ బాబూమోహన్కు, చెన్నూర్ నల్లాల ఓదేలుకు మాత్రం సీట్లు ఇవ్వడం లేదని చెప్పారు.