ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 19, 20 తేదీల్లో 9 నియోజక వర్గాలను కవర్ చేసేలా మొత్తం 6 బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం రెండున్నరకు ఖమ్మంలోనూ ,. 19వ తేదీ మధ్యాహ్నం మూడున్నరకు జనగామ జిల్లా పాలకుర్తిలోనూ ముఖ్యమంత్రి బహిరంగ సభలు ఉంటాయి. అలాగే 20వ తేదీ ఒంటిగంటకు సిద్దిపేటలోనూ, మధ్యాహ్నం రెండున్నరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోనూ సీఎం సభలు ఉంటాయి. ఇక 20వ తేదీ మధ్యాహ్నం మూడున్నరకు సిరిసిల్లలోనూ..
సాయంత్రం నాలుగున్నరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు.