ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టని ప్రధాని మోడీ

Update: 2018-05-06 09:03 GMT

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టడం లేదు ప్రధాని మోడీ. ప్రచార పర్వం చివరి దశకు చేరుకోవడంతో.. కాంగ్రెస్‌పై విమర్శల జోరు పెంచారు. టిప్పుసుల్తాన్‌ జయంతిని కాంగ్రెస్ పార్టీ నిర్వహించడాన్ని ప్రశ్నించారు. చిత్రదుర్గలో నిర్వహించిన బీజేపీ  సార్వజనిక సభలో పాల్గొన్న మోడీ.. ఆ ప్రాంతాన్ని పాలించిన చివరి రాజైన మడకరి నాయకను కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. మడకర నాయక జయంతిని చేయాల్సింది పోయి.. ఓట్ల కోసం  సుల్తాన్‌ జయంతిని జరిపిందంటూ టిప్పు సుల్తాన్ వ్యవహారంపై మండిపడ్డారు.

Similar News