జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టతే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో తన రాజకీయా యాత్ర పూర్తిచేసుకున్న ఆయన మరోసారి యాత్రకు రెడీ అవుతున్నారు. అందుకోసం జిల్లాలకు పర్యవేక్షకులను నియమించారు. వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలకు టూర్ పర్యవేక్షకుడిగా రాఘవయ్య నియమితులయ్యారు.. అలాగే శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం కి భాను.. అనంతపురం, కడప,చిత్తూర్, కర్నూలు కు పార్థసారధిని నియమించారు. టూర్ కి సంబంధించి అన్ని వ్యవహారాల్లో వీరు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.