ఎప్పటినుంచో బీజేపీతో దోస్తీ కోసం తెగ ఆరాటపడిపోతున్న వైసీపీ అధినేత జగన్ ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ఈ విషయమై క్లారిటీ ఇచ్చేసారు గతంలో ప్రధాని మోదీని కలిసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ బీజేపీతో కలిసే నిర్ణయం ప్రధాని మోడీకే వదిలేసారు.. జగన్ మోడీతో ఏమన్నారో ఒకసారి అయన మాటల్లోనే "మోదీగారితో కూడా అన్నాను. సార్.. నాది ఒక్కటే రిక్వెస్టు. ప్రత్యేక హోదా ఇవ్వండి, హోదా ఇస్తే మీతో కలిసి పనిచేస్తాను అని చెప్పాను. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇస్తారన్న నమ్మకం నాకుంది. ఇస్తే కలుస్తాం. ఇవ్వకపోతే కలవాల్సిన పనిలేదు" అని ఇంటర్వ్యూ సందర్బంగా చెప్పారు