బుధవారం జీశాట్- 29 ప్రయోగం

Update: 2018-11-13 16:03 GMT

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది..  శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా  జీశాట్-29 ఉపగ్రహం రోదసీలోకి పంపనున్నారు. ఈప్రయోగం కోసం ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది... బుధవారం సాయంత్రం 5.07  గంటల వరకు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం 5.08  గంటలకు మార్క్-3 రాకెట్ ద్వారా 3600 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. కాగా, సమాచార సాంకేతికతను మరింత బలోపేతం చేసేందుకు జీశాట్-29 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తోంది. గత ఏడాది ప్రయోగించిన జీశాట్-19 ఉపగ్రహంతో ఇప్పటికే కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

Similar News