మొదటి టెస్టులో టీమిండియా గెలుపు..

Update: 2018-12-10 05:31 GMT

అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ బోణి కొట్టింది. చేసింది తక్కువ స్కోరే అయినా కంగారులను మట్టికరిపించింది. రెండో ఇన్నింగ్స్  లో ఓవర్ నైట్ స్కోర్  104/4 తో ఐదోరోజు ఆటను కొనసాగించిన ఆసీస్ లంచ్ విరామ సమయానికి మరో రెండు వికెట్లను చేజార్చుకుని 188 పరుగులు చేసింది. ఆ తరువాత వెనువెంటనే మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. దాంతో 291 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టీంఇండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 తో ముందంజలో ఉంది. 

Similar News