భారత్ ఆలౌట్.. రెండువికెట్లు కోల్పోయిన ఆసీస్

Update: 2018-12-07 02:18 GMT

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోరు 250/9తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. ఒకే ఒక్క బంతి మాత్రమే ఆడింది. ప్రస్తుతం ఆసీస్ 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. మార్స్ 1, ఖవాజా 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఆసీస్ 199 పరుగులు వెనుకబడి ఉంది.

Similar News