'వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా'

Update: 2018-02-12 11:01 GMT

వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేస్తాని ఎమ్మెల్యే కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలోని వేములపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎ‍మ్మెల్యేలకు డిపాజిట్లు దక్కకుండా అన్నీ నియోజక వర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. ప్రభుత్వం రైతులను భిక్షగాళ్లలా చూస్తోందన్నారు. కాలుష్యం వెదజల్లే థర్మల్ ప్లాంట్‌ను దామరచర్లలో ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.

Similar News