బలపరీక్షలో కుమారస్వామి ఘన విజయం

Update: 2018-05-25 10:34 GMT

కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి విజయం సాధించారు. బలపరీక్షకు ముందు బీజేపీ సభను వాకౌట్ చేసింది. దీంతో సభలో కాంగ్రెస్‌, జేడీఎస్‌, ఇండిపెండెంట్ సభ్యులు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ వాకౌట్‌ తర్వాత జరిగిన బలపరీక్షలో కుమారస్వామికి 117 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. దీంతో ముఖ్యమంత్రిగా కుమారస్వామి బలం నిరూపించుకొని...సత్తా చాటుకున్నారు. 

Similar News