కేసీఆర్ పై పోటీచేస్తా ప్రముఖ గాయకుడు

Update: 2018-10-09 02:59 GMT

ప్రజలు కోరుకుంటే గజ్వేల్ నుండి పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ముందుగా ప్రతిపక్ష పార్టీల అధినేతలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. తన జీవితంలో ఓటు నమోదు చేసుకోవడమే  గొప్ప మార్పన్న అయన ఓటర్లలో చైతన్యం తీసుకొస్తానంటున్నారు. ఇందుకోసం చేపట్టిన తన ప్రజా చైతన్య యాత్రకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరినట్లు గద్దర్‌ వెల్లడించారు. కేసీఆర్ హామీ ఇచ్చి నేరవేర్చని దళితులకు 3 ఎకరాలు, లక్ష ఉద్యోగాలు, డబల్ బెడ్ రూమ్ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు.


 

Similar News