ఆపద్ధర్మ సీఎం కేసీఆర్పై పోటీకి సై అంటున్నారు ప్రజా నాయకుడు గద్దర్. ఇందుకోసమే గజ్వేల్ నియోజకవర్గంలో ఓటర్గా నమోదు చేసుకున్నానని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన కూటమి ద్వారా తనకు అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధమంటూ ప్రకటించారు. సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ను కలిసిన ఆయన గజ్వేల్లో ఓటు నమోదు చేసుకున్నట్టు వివరించారు.