గద్వాలలో వారసురాలి ప్రచారం

Update: 2018-10-06 09:49 GMT

తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ కూతురు డీకే స్నిగ్ధ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వెంకంపేట గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. డి కే అరుణను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్నిగ్ధ రెడ్డి జోష్యం చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏవిధమైన అభివృద్ధిని చేపట్టలేదని ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.

Similar News