వైసీపీ అధినేత జగన్పై ఫైర్ అయ్యారు మంత్రి దేవినేని ఉమా. దొంగలకు బ్రాండ్ అంబాసిడర్.. జగన్ అని నిప్పులుచెరిగారు. పవిత్రమైన అసెంబ్లీని జగన్ కించపరచడం దారుణం అన్నారు. రాజీనామా డ్రామాలు కట్టి పెట్టి.. దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించాలని వైసీపీకి సవాల్ విసిరారు. పులిచింతల నీళ్లు ఎటు వెళ్తాయో కూడా తెలియని జగన్.. పులిచింత ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు.