కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...సుఖోయ్-30 యుద్ధ విమానంలో విహరించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ఆర్మీ ఎయిర్బేస్కు వెళ్లిన నిర్మలా సీతారామన్...పైలెట్ షూట్ ధరించి గ్రూప్ కెప్టెన్ గార్గ్తో 8వేల మీటర్ల ఎత్తులో పయనించారు. యుద్ధం వస్తే భారత వాయు దళం...ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా ? లేదా అన్నది సీతారామన్ పరిశీలించారు. సుఖోయ్లో ప్రయాణించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సీతారామన్ చెప్పారు.