కొడంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాదే: కేసీఆర్

Update: 2018-12-04 13:15 GMT

ఈ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలకు గానూ 14 స్థానాల్లో టీఆర్ఎస్ గెలవబోతుందని టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌ పాలమూరు అభివృద్ధిని అడ్డుకునే వారు జిల్లాలోనే ఉన్నారని విమర్శించారు. జిల్లా ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని ఈసారి టీఆర్ఎస్‌ అభ్యర్థి గెలుపు వాస్తవాలను గమనించారు. అందుకే ఈ ఎన్నికల్లో పాత పాలమూరు జిల్లాల్లోని 14 స్థానాల్లో టీ ఆర్ ఎస్ గెలవబోతుందని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ ఫలితం ప్రజలు వాస్తవాలను గ్రహించి, గమనించారు కాబట్టి సాధ్యమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. కొడంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేసీఆర్‌ అన్నారు. ఈ జనాన్ని చూస్తుంటే పట్నం నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమైపోయిందన్నారు కేసీఆర్.
 

Similar News