తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవవందనాన్ని సీఎం స్వీకరించారు. అంతకుముందు పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ్నుంచి నేరుగా కేసీఆర్ గోల్కొండ కోటకు బయల్దేరారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.