చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్టు పనులను...తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి ఆకస్మకంగా తనిఖీ చేశారు. గడువులోగా చార్మినార్ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులకు సాలార్జంగ్ మ్యూజియం ఎదురు మూసిపై ప్రత్యేక నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. లాల్ బజార్, ముర్గి చౌక్, చార్ కమాన్, క్లాక్ టవర్, మోజంజామీ మార్కెట్ పునర్ నిర్మాణ పనులు పురోగతిని సీఎస్కు వివరించారు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్. గంటన్నర పాటు అక్కడే ఉన్న సీఎస్....ఇరానీ చాయ్ తాగి వెళ్లిపోయారు.