రేవంత్ రెడ్డి తరహాలో మరో ఎమ్మెల్యే ఆస్తుల చిట్టా బయటకొస్తోంది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు తొమ్మిది వందల కోట్లు అక్రమంగా సంపాదించారంటూ మంథని ఉప సర్పంచ్ సతీష్ ఐటీ, సీబీఐతో పాటు ఈడీకి ఫిర్యాదు చేశారు. తన తల్లి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్లు వసూలు చేసినట్టు ఆరోపిస్తున్న మంథని ఉప సంర్పంచ్.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఐదు కోట్ల విలువైన ఇల్లు కొన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.