తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. రేవంత్పై చర్యలు తీసుకోవాలంటూ తెరాస ఫౌండర్స్ ఫోరం నేతలు మహబూబ్నగర్ రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేవంత్రెడ్డి వాడిన పదజాలం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు మండిపడ్డారు.
మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయిందని, ‘కాంగ్రెస్’ లోకి కొత్త జోకర్ వచ్చాడని రేవంత్ ను ఉద్దేశించి మంత్రి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు విదితమే. ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతూ, లక్ష్మారెడ్డి తన నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనని, లక్ష్మారెడ్డి డాక్టర్ సర్టిఫికెట్ ఒరిజినల్దేనా? అంటూ రేవంత్ తీవ్ర విమర్శలు చేయడం జరిగింది.