ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేనిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
పైగా సోషల్ మీడియాలో ఓ మతాన్ని కించ పరిచేలా మాట్లాడారని కేవీ నారాయణ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. బాబు గోగినేని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ పేరుతో ఇటీవల హైదరాబాద్, విశాఖ, బెంగళూరులో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన వారి నుంచి ఆధార్ నెంబర్లు తీసుకున్నారు. వీటిని మలేషియా కంపెనీకి విక్రయించినట్టు కేవీ నారాయణ ఆరోపించారు. అలాగే సోషల్ మీడియాలో సౌదీ ఉగ్రవాద దేశమని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆ దేశానికి, మనకు మధ్య సత్ సంబంధాలు దెబ్బతింటాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మత గ్రంథాలను బాబు గోగినేని కించపరిచారని తన పిటిషన్ లో పేర్కోన్నారు. దీంతో హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బాబు గోగినేని కేసు నమోదయింది.