మొదటి బిగ్ బాస్ హిట్ అయినంతంగా రెండవ బిగ్ బాస్ ఆకట్టుకోలేకపోతుందనే భావనలో ఉంది యాజమాన్యం. కంటెస్టెంట్ల ఫెర్ఫార్మెన్సు సరిగా లేకనో నాని హోస్టింగ్ కుదరకనో మొత్తానికి బిగ్ బాస్2 పేలవంగా నడుస్తోంది. దీంతో షో కు కొత్తకళ కావాలనే ఉద్దేశంతో కొత్తవాళ్లను హౌస్ కు ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోకుమారీ 21F తో కుర్రకారు మతులు పోగొట్టిన టాలీవుడ్ భామ హెబ్బా పటేల్ని బిగ్ బాస్ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. హెబ్బా రాకతోనైనా హౌస్కి కొత్త కళ వస్తుందేమోనని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇప్పటికే హౌస్కి వచ్చిన నందిని వల్ల షోకి ప్లస్ ఏమీ కాలేదని అందుకే హెబ్బాని రంగంలోకి దించే ప్రయత్నం చేసింది.