బీజేపీలో చేరి ఆరపూట కూడా గడవలేదు.. పద్మినీరెడ్డి బ్యాక్ టు కాంగ్రెస్.. కారణం ఏంటంటే..

Update: 2018-10-11 16:27 GMT

బీజేపీలో చేరి కొన్నిగంటలు కూడా కాలేదు అప్పుడే.. కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి భార్య పద్మినీరెడ్డి.. ఉదయం కాషాయ కండువా కప్పుకున్న ఆమె.. సాయంత్రానికి మనసు మార్చుకున్నారు. తన భర్త మనోవేదన చూడలేకపోతున్నానంటూ.. ఆమె తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ఆదేశిస్తే సంగారెడ్డి నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు గంటల వ్యవధిలో పద్మినీరెడ్డి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడుతోంది. 

Similar News