అధికార పార్టీల్లో చేరితే సరిపోతుంది కదా?

Update: 2018-01-22 08:34 GMT

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ‌ని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఘాటుగా విమర్శించారు.  పవన్‌ కల్యాణ్‌ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం అంటే ఏపీలో పెరుగున్నం తిని తెలంగాణలో బిర్యానీ తినడం కాదన్నారు. అధికార పార్టీలకు భజన చేస్తున్న ఆయన మరో పార్టీ ఎందుకు పెట్టారని  ప్రశ్నించారు. నాయకుండంటే  ప్రజల పక్షాల నిలవాలని కానీ అధికార పార్టీల వైపు కాదని సూచించారు. అటు చంద్రబాబును ఇటు కేసీఆర్‌పై ప్రసంశల జల్లు కురిపించడం చూస్తుంటే ఇదో ప్యాకేజీల పార్టీగా కనబడుతుందని విమర్శించారు.

Similar News