మందుబాబులకు గుడ్ న్యూస్

Update: 2018-08-03 04:47 GMT

మందుబాబులకు కిక్కించే వార్త ఇది జీహెచ్ఎంసీ పరిధి బార్లలో ఇక రాత్రి ఒంటి గంట వరకు మందుకొట్టొచ్చు ఇది కేవలం శుక్ర, శనివారం మాత్రమే.  జీహెచ్ఎంసీతోపాటు దాని పరిధిలోని ఐదు కిలోమీటర్లలో ఉన్న బార్లకే పరిమితం అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో రాత్రి సమయాన్ని మరో గంట పెంచాలని బార్ల యజమానుల సంఘం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీంతో స్పందించిన సర్కార్ శుక్ర, శనివారాల్లో ఒంటిగంటదాకా అనుమతి ఇచ్చింది. మిగతా రోజుల్లో పాత సమయాలే వర్తిస్తాయి. కొత్త నిర్ణయంతో వీకెండ్ లో మధ్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని సర్కార్ భావిస్తోంది. 

Similar News