తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇప్పటికి 82 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మరో 5 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సినీనిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందనలు’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందనలు. బండ్ల గణేష్
— BANDLA GANESH (@ganeshbandla) December 11, 2018