ఏ పార్టీతో పొత్తు లేదు..తేల్చేసిన అమిత్ షా..

Update: 2018-05-09 06:05 GMT

గడిచిన 4 ఏళ్లలో తమ పార్టీ 11 చోట్ల అధికారం సాధించిందని, ఈసారి కర్ణాటకలో అధికారం బీజేపీదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. అని సర్వేలు తమ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన కర్ణాటకలో బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని చెప్పారు. అందుకు కారణం నరేంద్రమోదీ సర్కారు కర్ణాటక అభివృద్ధి కోసం రూ.3లక్షల కోట్ల కేటాయింపేనన్నారు. ప్రస్తుతానికి కర్ణాటకలో ఏ పార్టీతో పొత్తు లేదన్న అయన  సొంతంగానే తాము అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. మే 15 న సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని  కర్ణాటక కాంగ్రెస్ కు ఆఖరు రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. 

Similar News