గ్రామంలోకి వస్తే చంపేస్తాం.. అడవిలో తలదాచుకుంటున్న ప్రేమజంట

Update: 2018-09-22 14:22 GMT

ఇటీవల ప్రేమికులపై తీవ్రమైన దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా యువకుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు మారుతీరావు అనే వ్యాపారి. ఈ ఉదంతం మరవకముందే.. హైదరాబాద్ లో కన్నతండ్రే కూతురిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.. తాజాగా జనగామ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను గ్రామంలోని పెద్ద మనుషులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ఘటన గుండాల మండలం మరిపడగ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే ఊరిలోకి వస్తే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలోకి రావొద్దని.. వస్తే చంపేస్తామనడంతో దిక్కుతోచని స్థితిలో ఆ జంట అడవిలో తలదాచుకుంది. 

Similar News