విడుదలకు సిద్ధమవుతున్న ‘47డేస్’

Update: 2018-11-10 03:15 GMT

సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తున్న మరో చిత్రం ’47డేస్’ సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రదీప్ మద్దాలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచే ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా అన్ని పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని త్రిశూల్ సినిమా ఓవర్ సీస్ హక్కులు దక్కించుకుంది. కాగా ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం సమకూర్చారు.

Similar News