మోదీ నాయకత్వంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్, హిమచల్ లో బీజేపీ ఎన్నికల్లో గెలుపును కార్యకర్తల విజయంగా అభివర్ణించారు. రానున్న కాలంలో కర్ణాటక సహా 4 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.