ఉత్తర్ప్రదేశ్లోని కుషీనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 13మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు తునాతునకలైంది. డివైన్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సును థావే-కపటన్గంజ్ ప్యాసింజర్ రైలు బెహ్పుర్వా రైల్వే క్రాసింగ్ వద్ద ఢీకొట్టిందని రైల్వే అధికార ప్రతినిధి వేద్ ప్రకాశ్ వెల్లడించారు. రైలు సివాన్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది 10 సంవత్సరాల లోపు చిన్నారులే అని అధికారులు తెలిపారు. ఘటనలో బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడని పోలీసు అధికారి ఓపీ సింగ్ వెల్లడించారు.