US Tariffs: భారత కంపెనీలకు సంజీవనీలా అమెరికా టారీఫ్ లు.. భారీగా పెరగనున్న ఆదాయం
US Tariffs: అమెరికా విధించిన కొత్త టారిఫ్లు కొన్ని భారతీయ కంపెనీలకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా డిక్సన్ టెక్నాలజీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్లూ స్టార్, హావెల్స్ వంటి కంపెనీలు అమెరికా టారిఫ్లను భారత్కు ఒక సంజీవనిగా భావిస్తున్నాయి.
US Tariffs: భారత కంపెనీలకు సంజీవనీలా అమెరికా టారీఫ్ లు.. భారీగా పెరగనున్న ఆదాయం
US Tariffs: అమెరికా విధించిన కొత్త టారిఫ్లు కొన్ని భారతీయ కంపెనీలకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా డిక్సన్ టెక్నాలజీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్లూ స్టార్, హావెల్స్ వంటి కంపెనీలు అమెరికా టారిఫ్లను భారత్కు ఒక సంజీవనిగా భావిస్తున్నాయి. ఎందుకంటే, చాలా భారతీయ కంపెనీలకు ఇప్పుడు అమెరికా భాగస్వాముల నుంచి భారీగా ఆర్డర్లు, వ్యాపార అవకాశాలపై విచారణలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) కూడా మరింత బలోపేతం అవుతుందని చర్చ జరుగుతోంది.
ఈటీ (ఎకనామిక్ టైమ్స్) నివేదిక ప్రకారం.. డిక్సన్ టెక్నాలజీస్ తన ప్రధాన కస్టమర్ల నుంచి వచ్చిన భారీ ఆర్డర్లను పూర్తి చేయడానికి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 50శాతం వరకు పెంచుతోంది. ఈ విస్తరణలో పెద్ద భాగం ఉత్తర అమెరికాకు ఎగుమతుల కోసం ఉంటుందని తెలుస్తోంది. కాంపిల్ (Compal) ద్వారా ఒక పెద్ద అమెరికన్ బ్రాండ్కు ఉత్పత్తి అవుతున్న వస్తువుల పరిమాణం ఎగుమతి అవకాశాలతో మరింత పెరగనుంది.
మీడియా నివేదికల ప్రకారం.. దాని ప్రధాన కస్టమర్ మోటోరోలా (అమెరికాకు హ్యాండ్సెట్లను ఎగుమతి చేస్తుంది), అమెరికన్ బ్రాండ్ గూగుల్ పిక్సెల్. ఈటీ నివేదిక ప్రకారం.. గూగుల్ కూడా భారత్ నుండి హ్యాండ్సెట్లను ఎగుమతి చేయాలని చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఆపిల్, శామ్సంగ్ వంటి మొబైల్ ఫోన్ కంపెనీలను భారత్ లేదా ఇతర ప్రాంతాల నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి బదులుగా అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని, లేకపోతే 25శాతం టారిఫ్ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అదనపు టారిఫ్లు ఉన్నప్పటికీ, కంపెనీలకు భారత్లో ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడం చౌకగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భారతీయ కంపెనీలు తమ అనేక అమెరికా కస్టమర్ల నుండి ఆర్డర్ల పరిమాణంలో పెరుగుదలను చూస్తున్నాయి. దీంతో కంపెనీల లాభాల మార్జిన్లు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయి. ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో బలమైన డిమాండ్తో లాభాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది టెక్స్టైల్ రంగంలో గత ఏడాది కంటే ఎక్కువ ఉత్పత్తిని నమోదు చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా చైనాపై విధించిన టారిఫ్లను 145% నుంచి 30%కి తగ్గించింది. అయితే భారత్ 26% టారిఫ్ను విధించింది. ఇది ప్రస్తుతం నిలిపివేయబడింది. అమెరికా భారత్పై కేవలం 10% టారిఫ్ను మాత్రమే విధించింది. అయితే, జూలై నుండి 26% టారిఫ్ మళ్ళీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఎఫ్ఎమ్సిజి రంగంలో ప్రముఖ సంస్థ అయిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ డిసౌజా మాట్లాడుతూ.. కాఫీ, టీ వంటి ఉత్పత్తులు, అమెరికాకు ఎగుమతి అవుతాయి. అక్కడ ఉత్పత్తి కావు కాబట్టి పోటీ పరంగా మనం మిగిలిన అందరితో సమానంగా ఉంటామని వెనుకబడబోమని అన్నారు. హావెల్స్ ఇటీవల అమెరికాకు భారత్లో తయారైన ఏసీల మొదటి సరుకును పంపింది. భారత్ అమెరికా బిటిఎకు లబ్ధిదారు అవుతుందని ఆ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఈ పరిణామాలు భారతీయ తయారీ రంగానికి, ఎగుమతులకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి.