E20 Petrol: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్.. 2023 ముందు కొనిన బైక్, కార్ల పరిస్థితి ఏంటి?
E20 Petrol: దేశీయ ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కేవలం E20 పెట్రోల్ను మాత్రమే విక్రయించాలని భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
E20 Petrol: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్.. 2023 ముందు కొనిన బైక్, కార్ల పరిస్థితి ఏంటి?
E20 Petrol: దేశీయ ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కేవలం E20 పెట్రోల్ను మాత్రమే విక్రయించాలని భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఐఓసిఎల్ (IOCL), బిపిసిఎల్ (BPCL), హెచ్పిసిఎల్ (HPCL) వంటి చమురు కంపెనీలు బిఐఎస్ (BIS) ప్రమాణాలకు అనుగుణంగా కేవలం E20 ఇంధనాన్ని మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.
E20 పెట్రోల్ అంటే ఏమిటి?
ప్రస్తుతం మనం వాడుతున్న పెట్రోల్ను E10 అంటారు, ఇందులో 10 శాతం ఇథనాల్ కలుపుతారు. కొత్త నిబంధన ప్రకారం, పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని 20 శాతానికి పెంచుతారు. దీనినే E20 పెట్రోల్ అని పిలుస్తారు.
వాహనదారుల ఆందోళన - మైలేజీపై ప్రభావం:
ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వాహనదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి ప్రధాన కారణాలు:
మైలేజీ తగ్గుదల: E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజీ 3 నుండి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
ఇంజిన్ సమస్యలు: వాహనాల్లోని ప్లాస్టిక్, రబ్బర్ పార్టులతో పాటు ఇంజిన్ భాగాలపై కూడా దీని ప్రభావం ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
2023 కంటే ముందు కొన్న వాహనాల పరిస్థితి ఏమిటి?
కేంద్ర ప్రభుత్వ వివరణ ప్రకారం, 2023 తర్వాత తయారైన అన్ని వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగా (Compatible) ఉన్నాయి. అయితే, 2023 కంటే ముందు వచ్చిన పాత వాహనాల్లో మాత్రమే చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని, కొత్త వాహనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం వెనుక ఉన్న 4 ప్రధాన కారణాలు:
దిగుమతుల తగ్గింపు: విదేశాల నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులను భారీగా తగ్గించుకోవడం.
పర్యావరణ రక్షణ: కాలుష్యాన్ని నియంత్రించడం.
రైతులకు మేలు: ఇథనాల్ను చెరుకు, మొక్కజొన్న, వరి వంటి పంటల నుండి తయారు చేస్తారు. దీనివల్ల రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది.
బయో ఫ్యూయల్ ప్రమోషన్: దేశంలో జీవ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడం.