Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలబాట
Stock Market: ఆరంభ ట్రేడింగ్ లో ప్రతికూల బాటన నష్టాలు * వెనువెంటనే కోలుకున్న దేశీ సూచీలు
Representational Image
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 65 పాయింట్లు మేర క్షీణించగా..నిఫ్టీ 20 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేసింది..వెనువెంటనే కోలుకున్న సూచీలు తిరిగి లాభాల బాటన కొనసాగుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 29 పాయింట్లు ఎగసి 51,452 వద్దకు చేరగా , నిఫ్టీ 10 పాయింట్ల మేర స్వల్ప లాభంతో 15,446 వద్ద కదలాడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో పాటు కోవిడ్ కొత్త కేసులు ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే తక్కువగా నమోదు కావడం సానుకూల ప్రభావాన్ని చూపవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు