Today Gold, Silver Rates: పెరిగిన పసిడి, వెండి ధరలు

Today Gold, Silver Rates: పెరిగిన పసిడి, వెండి ధరలు

Update: 2021-10-25 03:15 GMT

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 230 రూపాయలు పెరిగి పసిడి ధర రూ.48,830 కి చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరుగుదలతో రూ.44,760 కు చేరింది. ఇలా పసిడి ధర పెరగగా వెండి ధర కూడా తటస్థంగా ఉండిపోయింది. వెండి రేటు కూడా 100రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ. 69,900 కు చేరింది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర నిలకడగా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.13 శాతం క్షీణించి పసిడి రేటు ఔన్స్‌కు 1794 డాలర్లకు చేరింది. వెండి రేటు ఔన్స్‌కు 0.04 శాతం తగ్గుదలతో 24.44 డాలర్లకు చేరింది.

Tags:    

Similar News