Stock Market : దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట
* అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం * సెన్సెక్స్ 270 పాయింట్లు అప్.. నిఫ్టీ 16,322 వద్ద ట్రేడింగ్
Representation Photo
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో తాజా సెషన్ లో దేశీ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించాయి. ఉదయం 10 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 270 పాయింట్ల మేర ఎగసి 54,651వద్దకు చేరగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 67 పాయింట్ల మేర లాభంతో 16,322 వద్ద కదలాడుతున్నాయి.