Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Update: 2021-04-22 11:31 GMT

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ తాజా సెషన్ లో బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న ప్రకంపనలు లాక్ డౌన్లు ఆర్థికవ్యవస్థపై మరోమారు ఆందోళనలు వెరసి సూచీలు ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. అయితే మిడ్ సెషన్ సమయానికి మదుపర్లు కొనుగోళ్ళకు ఆసక్తి చూపడంతో సూచీలు లాభాల్లోకి మళ్లాయి. చివరకు బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 374 పాయింట్ల లాభంతో 48,080 వద్దకు చేరగా , నిఫ్టీ 109 పాయింట్ల మేర లాభంతో 14,406 వద్ద స్థిరపడింది.

Tags:    

Similar News