దూకుడు: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల ముగింపు

Update: 2021-02-25 10:24 GMT

దూకుడు: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల ముగింపు 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోమారు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యంలో బెంచ్ మార్క్ సూచీలు ఆరంభంలోనే గరిష్ట లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257 పాయింట్లు జంప్ చేసి 51,039 వద్దకు చేరగా, నిఫ్టీ 115 పాయింట్లు ఎగబాకి 15,097 వద్ద స్థిరపడ్డాయి. క్రితం సెషన్ లో నిఫ్టీ లో ఏర్పడ్డ సాంకేతిక లోపం దరిమిలా ట్రేడింగ్ సమయాన్ని పొడిగించగా కీలక సూచీలు సరికొత్త గరిష్టాలకు చేరాయి. తాజా సెషన్ లోనూ అదే దూకుడుతో దేశీ మార్కెట్లు లాభాల బాటన సాగాయి.

Tags:    

Similar News