Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Update: 2021-06-10 10:48 GMT

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత రెండు సెషన్లలో నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు తాజా సెషన్ లో లాభాల బాట పట్టాయి. మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 358 పాయింట్లు ఎగసి 52,300 వద్దకు చేరగా జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 102 పాయింట్ల మేర లాభంతో 15,737 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా మెటల్స్, హెల్త్ కేర్ , ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి.

Tags:    

Similar News