Stock Market: లాభాల బాటన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 488 పాయింట్లు ఎగసి 49,494 వద్ద ట్రేడింగ్ * 154 పాయింట్లు మేర లాభంతో 14,661 వద్ద నిఫ్టీ

Update: 2021-03-30 04:18 GMT

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు. తాజావారం తొలి సెషన్ లో లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 398 పాయింట్లు మేర జంప్ చేయగా నిఫ్టీ 14,640 మార్క్ ఎగువకు చేరింది.

అయితే దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగుతోంది...ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 488 పాయింట్లు ఎగసి 49,494 వద్దకు చేరగా నిఫ్టీ 154 పాయింట్లు మేర లాభంతో 14,661 వద్ద కదలాడుతున్నాయి.

Tags:    

Similar News