బంగారం భారీ పతనం.. వెండి ధరలూ తగ్గాయి!

Update: 2020-05-28 02:35 GMT

హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ పతనం చెందాయి. బంగారంధరలు ఈరోజు (మే28) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబాద్ లో ఒక్కసారిగా కిందికి పడిపోతే..ఢిల్లీ లో మాత్రం నిలకడగా ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు కూడా కిందికి దిగివచ్చాయి.

బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (28.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 920 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,310 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 910 రూపాయల తగ్గుదలతో 48,090 రూపాయలు నమోదు చేసింది.

పైకెగసిన వెండి ధరలు...

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కూడా తగ్గుదల బాట పట్టాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే 800 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 47వేల గరిష్ట మార్కుకు చేరింది. కేజీ వెండి ధర 47,900 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 920 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,310 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 910 రూపాయల తగ్గుదలతో 48,090 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 47,900 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు మార్పులు లేకుండా 47,810 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా కదలకుండా 46,000 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 700 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కు వద్దకు చేరి 47,900 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News