హైదరాబాద్ లో దిగివచ్చిన బంగారం..వెండి ధరలు పైపైకి!

Update: 2020-05-27 03:53 GMT

హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా దిగివచ్చాయి. బంగారంధరలు ఈరోజు (మే27) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబాద్ లో కిందికి దిగితే..ఢిల్లీ లో నిలకడగా ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు మరింత పైకెగాశాయి.

బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (27.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 210 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,230 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 140 రూపాయల తగ్గుదలతో 49,010 రూపాయలు నమోదు చేసింది.

పైకెగసిన వెండి ధరలు...

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 700 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల గరిష్ట మార్కు నుంచి పైకి చేరింది. కేజీ వెండి ధర 48,700 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 210 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,230 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 140 రూపాయల తగ్గుదలతో 49,000 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,230 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు మార్పులు లేకుండా 47,810 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా కదలకుండా 46,000 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 700 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కు కంటే పైకీ చేరి 48,230 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

 


Tags:    

Similar News