బంగారం ధరలు మళ్ళీ పైకెగాశాయి. రెండు రోజులపాటు తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు (మే25) దేశీయంగా పెరుగుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు కూడా కాస్త పైకెగాశాయి
బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (25.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 420 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45290 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 320 రూపాయల పెరుగుదలతో 49,000 రూపాయలు నమోదు చేసింది.
పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుదల బట పట్టాయి. కేజీవెండి ధర శనివారం నాటి ధరల కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49వేల గరిష్ట మార్కు నుంచి కిందికి దిగివచ్చింది. కేజీ వెండి ధర 48,360 రూపాయల వద్ద నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 420 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,290 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 320 రూపాయల పెరుగుదలతో 49,000 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,360 రూపాయల వద్దకు చేరింది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 220 రూపాయలు పెరిగి 47,920 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 210 రూపాయల పెరుగుదలతో 46,110 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 110 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 49 వేల మార్కు కంటే కిందకు చేరి 48,360 రూపాయలుగా నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.