బంగారం ధరల పరుగులకు బ్రేకులు పడ్డాయి. వరుసగా పెరిగిపోతూ కలవరపెడుతున్న బంగారం ధరలు ఈరోజు (మే21) దేశీయంగా కాస్త నెమ్మదించాయి.. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీ స్థాయిలో పెరిగిపోయి షాకిచ్చాయి.
బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (21.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 560 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,360 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 590 రూపాయల తగ్గుదలతో 48,400 రూపాయలు నమోదు చేసింది.
షాకిచ్చిన వెండి ధరలు...
బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా వెండి ధరలు ఒక్కసారిగా పైకెగాశాయి. కేజీవెండి ధర నిన్నటి ధరల కంటే 1340 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49వేల గరిష్ట మార్కు వద్దకు వెండి ధర చేరిందిది. కేజీ వెండి ధర 49,000 రూపాయల వద్ద నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 560 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,360 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 590 రూపాయల తగ్గుదలతో 48,400 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 49,000 రూపాయల వద్దకు చేరింది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు కిందికి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 960 రూపాయలు తగ్గి 48,000 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 360 రూపాయల తగ్గుదలతో 46,200 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1340 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 49 వేల మార్కు వద్దకు చేరి 49,000 రూపాయలుగా నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.