బంగారం ధరల పరుగులు ఆగలేదు. ఈరోజు (మే20) బంగారం ధరలు దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం కాస్త కిందకి దిగొచ్చాయి.
బంగారం ధరలు ఈరోజూ పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (20.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 60 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,920 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 60 రూపాయల పెరుగుదలతో 48,990 రూపాయలు నమోదు చేసింది.
కాస్త తగ్గిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు కిందికి దిగొచ్చాయి. కేజీవెండి ధర నిన్నటి ధరల కంటే 840 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48వేల గరిష్ట మార్కు నుంచి కిందికి వెండి ధర తగ్గింది. కేజీ వెండి ధర 47,660 రూపాయల వద్దకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 60 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,920 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 60 రూపాయల పెరుగుదలతో 48,990 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,000 రూపాయల కంటే కిందికి దిగొచ్చి.. 47,660 రూపాయలు నమోదు చేసింది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 60 రూపాయలు పెరిగి 48,960 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయల పెరుగుదలతో 46,560 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 840 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కు నుంచి కిందికి దిగొచ్చింది. కేజీ వెండి ధర 47,660 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.