వరుసగా రెండోరోజు బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. ఈరోజు (మే16) బంగారం ధరలు దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా చుక్కలనంటాయి.
బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (16.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 120 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,840 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 120 రూపాయల పెరుగుదలతో 47,870 రూపాయలు నమోదు చేసింది.
భారీగా పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు అమాంతం భారీగా పెరిగాయి. కేజీవెండి ధర నిన్నటి ధరల కంటే 2100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45 వేల గరిష్ట మార్కు దాటి వెండి ధర పైకెగసింది. కేజీ వెండి ధర 45,250 రూపాయల వద్దకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 120 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,840 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 120 రూపాయల పెరుగుదలతో 47,870 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 45,000 రూపాయల కంటే పైకెగసి 45,250 రూపాయలు నమోదు చేసింది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 600 రూపాయలు పెరిగి 47,800 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయల పెరుగుదలతో 45,600 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా కేజీకి 2100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 45 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 45,250 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.