Gold and Silver Prices Drop Sharply ఒక్కరోజే తులంపై ఎంత తగ్గిందంటే?

గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూరోపియన్ యూనియన్ కీలక ప్రకటనలతో బులియన్ మార్కెట్ లో ధరలు భారీగా దిగొచ్చాయి. నేటి తాజా ధరలు ఇవే..

Update: 2026-01-22 05:52 GMT

గత కొద్దిరోజులుగా రాకెట్‌లా దూసుకుపోతున్న పసిడి పరుగులకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఆకాశమే హద్దుగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు బుధవారం ఒక్కసారిగా దిగొచ్చాయి. అగ్రరాజ్యాల నుంచి వెలువడిన సానుకూల ప్రకటనలు బులియన్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించడంతో, అటు బంగారం, ఇటు వెండి ధరలు భారీగా క్షీణించాయి.

ఎందుకీ తగ్గుదల?

గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న రెండు కీలక పరిణామాలు ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమయ్యాయి:

భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం: భారత్‌తో వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లేయెన్ ప్రకటించారు. దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణిస్తుండటం మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపింది.

ట్రంప్ ప్రకటన: భారత్-అమెరికా మధ్య త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచింది.

నేటి తాజా ధరల వివరాలు (జనవరి 22, 2026):

బంగారం ధరల్లో భారీ ఊరట లభించింది. 24 క్యారెట్ల పసిడిపై ఏకంగా రూ. 2,290 మేర కోత పడింది.

 వెండి ధరలు 'ఢమాల్'..

బంగారంతో పోటీ పడుతూ పెరుగుతున్న వెండి ధర ఒక్కరోజే భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 తగ్గింది.

హైదరాబాద్/చెన్నై: కిలో వెండి ధర రూ. 3,40,000 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ/ముంబై/కోల్‌కతా: కిలో వెండి ధర రూ. 3,25,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

కొనుగోలుదారుల్లో చిగురిస్తున్న ఆశలు

పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు ఇలా ఒక్కసారిగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే ట్రెండ్ కొనసాగుతుందో లేదో అని బులియన్ నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News