Crypto Market Crash: క్రిప్టో మార్కెట్‌లో చీకటి రోజు.. బిట్‌కాయిన్ పతనం వెనుక అసలు కారణాలు ఇవే!

Crypto Market Crash: క్రిప్టో మార్కెట్ చరిత్రలో గురువారం ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. టెక్ స్టాక్స్ పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై ఆందోళనల మధ్య బిట్‌కాయిన్ విలువ అమాంతం పడిపోయింది.

Update: 2026-02-06 03:29 GMT

Crypto Market Crash: క్రిప్టో మార్కెట్‌లో చీకటి రోజు.. బిట్‌కాయిన్ పతనం వెనుక అసలు కారణాలు ఇవే!

Crypto Market Crash: క్రిప్టో మార్కెట్ చరిత్రలో గురువారం ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. టెక్ స్టాక్స్ పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై ఆందోళనల మధ్య బిట్‌కాయిన్ విలువ అమాంతం పడిపోయింది. అక్టోబర్ 2024 నుండి కనిష్ట స్థాయికి పడిపోయిన బిట్‌కాయిన్, ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

కేవలం ఒక్కరోజులోనే క్రిప్టో మార్కెట్ నుండి సుమారు $1 బిలియన్ల లిక్విడేషన్లు జరిగాయి. అంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీ నష్టాలతో ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బిట్‌కాయిన్ ధర 12.6% తగ్గి $63,525 వద్దకు చేరుకుంది. 2022 నవంబర్ తర్వాత ఇదే అతిపెద్ద ఒకరోజు పతనం. రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఈథర్ కూడా 13% తగ్గి $1,854 వద్ద ట్రేడవుతోంది. ఈ ఒక్క వారంలోనే ఇది 19% నష్టాన్ని చవిచూసింది.

పతనానికి ప్రధాన కారణాలు ఇవే..

టెక్ స్టాక్స్,ఏఐ (AI) గందరగోళం: సాధారణంగా క్రిప్టో మార్కెట్ టెక్ స్టాక్స్‌తో ముడిపడి ఉంటుంది. నాస్డాక్, S&P 500 సూచీలు పడిపోవడం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై ఒత్తిడి పెరగడం క్రిప్టోపై ప్రభావం చూపింది.

తదుపరి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ ఎంపికయ్యే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. ఆయన వస్తే ఫెడ్ బ్యాలెన్స్ షీట్‌ను కుదించి, మార్కెట్లో ద్రవ్యత తగ్గిస్తారని, అది క్రిప్టో లాంటి రిస్క్ ఆస్తులకు మరణశాసనం అవుతుందని విశ్లేషకులు భయపడుతున్నారు.

అక్టోబర్ 2025 నుండి బిట్‌కాయిన్ ETFల నుండి నిధులు భారీగా బయటకు ప్రవహిస్తున్నాయి. జనవరిలో మాత్రమే సుమారు $3 బిలియన్ల నిధులు ఉపసంహరించబడ్డాయి. ఇది సాంప్రదాయ పెట్టుబడిదారులు క్రిప్టోపై ఆసక్తి కోల్పోతున్నారనే సంకేతాన్ని ఇస్తోంది.

ఇది కేవలం స్వల్పకాలిక దిద్దుబాటు కాదు. మార్కెట్ రీసెట్ అవుతోంది. ఇది కోలుకోవడానికి వారాలు కాదు, నెలలు పట్టవచ్చు అని ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్ నిక్ పుక్రిన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు క్రిప్టో మైనర్లు కూడా నష్టాల్లో ఉండటంతో, వారు తమ వద్ద ఉన్న కాయిన్లను విక్రయించడం మొదలుపెడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని జెఫరీస్ వ్యూహకర్త మోహిత్ కుమార్ హెచ్చరించారు.

Tags:    

Similar News