Cognizant 100 Percent Bonus: ఐటీ ఉద్యోగులకు పండగే.. కాగ్నిజెంట్ బంపర్ బోనస్.. ఏకంగా 100% ప్రకటించిన సీఈఓ!
Cognizant 100 Percent Bonus: కాగ్నిజెంట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! 2025 ఏడాదికి 100 శాతం బోనస్ ప్రకటిస్తూ సీఈఓ రవికుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ సాధించిన అద్భుత వృద్ధి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Cognizant 100 Percent Bonus: ఐటీ ఉద్యోగులకు పండగే.. కాగ్నిజెంట్ బంపర్ బోనస్.. ఏకంగా 100% ప్రకటించిన సీఈఓ!
Cognizant 100 Percent Bonus: దేశీయ ఐటీ రంగంలో కొలువుల కోత, జీతాల పెంపుపై ఆందోళనల నడుమ ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) తమ ఉద్యోగులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. 2025 సంవత్సరానికి గానూ అర్హులైన ఉద్యోగులందరికీ 100 శాతం బోనస్ అందజేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
లక్ష్యం కంటే ముందే విజయం!
వాస్తవానికి కంపెనీ నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను (Winner’s Circle) 2027 నాటికి చేరుకోవాలని భావించగా.. ఉద్యోగుల కృషి ఫలితంగా రెండేళ్ల ముందే అంటే 2025లోనే ఆ ఘనతను సాధించింది. ఈ అద్భుత విజయానికి గుర్తుగా ఉద్యోగులకు ఈ రివార్డును ప్రకటించినట్లు సీఈఓ ఎస్. రవికుమార్ వెల్లడించారు.
ముఖ్య విశేషాలు ఇవే:
బోనస్ ప్రకటన: పనితీరు ఆధారంగా 100% బోనస్ చెల్లింపులు.
ఆదాయ వృద్ధి: 2025లో కంపెనీ ఆదాయం 7% పెరిగి 21.10 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.90 లక్షల కోట్లు) చేరింది.
భారత ఉద్యోగులకు మేలు: కాగ్నిజెంట్కు ప్రపంచవ్యాప్తంగా 3.50 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, అందులో అత్యధికులు భారత్లోనే పనిచేస్తున్నారు. వారందరికీ ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.
విన్నర్స్ సర్కిల్: ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ లాభాలు ఆర్జించే అగ్రశ్రేణి ఐటీ సంస్థల జాబితాలో కాగ్నిజెంట్ స్థానం సంపాదించుకుంది.
"మన ఉద్యోగుల క్రమశిక్షణ, నిబద్ధత వల్లే ఇది సాధ్యమైంది. క్లయింట్ల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ ఈ బోనస్ ఒక గుర్తింపు." — ఎస్. రవికుమార్, కాగ్నిజెంట్ సీఈఓ