Ration Cards: వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..ఫిబ్రవరి 15 నుంచి రేషన్ కార్డులు క్యాన్సిల్

Update: 2025-01-27 12:51 GMT

 Ration Cards: వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..ఫిబ్రవరి 15 నుంచి రేషన్ కార్డులు క్యాన్సిల్

Ration Cards: కేంద్రంలోని మోదీ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇవి ప్రజలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా ఉన్నాయి. దీనిలో భాగంగానే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్వహించడమే ఒక ప్రత్యేక పథకం ద్వారా ప్రజలకు తక్కువ ధర రేషన్ అందిస్తున్నారు. ఈ స్కీములో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతోంది. ఈ స్కీమ్ కింద అర్హత ఉన్న వ్యక్తులు ప్రభుత్వంతో ఫ్రీ రేషన్ సౌకర్యాన్ని పొందుతున్నారు. అయితే ఈ స్కీమ్ కింద అర్హతా ప్రమాణాలను పాటించే వ్యక్తులకే ప్రయోజనాలు లభిస్తాయి.

ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న ప్రజలకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం కొంతమంది రేషన్ కార్డు హోల్డర్లకు మాత్రమే ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత ఈ మార్గదర్శకాలను పాటించని వారికి రేషన్ కార్డు రద్దు అవుతుంది.

రేషన్ కార్డు హోల్డర్లు ఈ స్కీము కింద ప్రయోజనాలను పొందాలనుకుంటే ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే ఈ స్కీమ్ కింద రేషన్ పొందలేరు. ఈ కొత్త మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం నకిలీ రేషన్ కార్డులను హోల్డర్లను గుర్తించడమే. ఈ కేవైసీ ప్రాసెస్ ద్వారా ప్రభుత్వం ఫేక్ రేషన్ కార్డు హోల్డర్లను గుర్తిస్తుంది. వీరిని ఈ స్కీము నుంచి తొలగిస్తారు. ఇది నిజమైన అర్హులైన వ్యక్తులకు మాత్రమే ప్రయోజనాలు అందే విధంగా చూడటంలో సహాయపడుతుంది. ఈ కేవైసీ పూర్తి చేయాలంటే మీకు దగ్గరలోని ఆహార సరఫరా కేంద్రానికి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

ప్రజలు తమ ఈ కేవైసీ ప్రక్రియ సమయానికి పూర్తి చేస్తేనే స్కీం కింద రేషన్ పొందుతారు. ఈ మార్గదర్శకాలు ప్రజల కోసం రేషన్ స్కీం సద్వినియోగాన్ని ప్రోత్సహించడమే కాకుండా నిజమైన అర్హులైన వారికి మోసం చేయకుండా రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Tags:    

Similar News